విశాఖ క్రైమ్:
సిబ్బంది సంక్షేమంతో పాటుగా వారు అందించిన సేవల యందు ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 203 మందికి రివార్డులను బుధవారం ఉదయం నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి అందజేశారు. క్రైమ్ రివ్యూ మీటింగ్ నందు గత నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ 203 మందికి రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం,అలాగే .నగర పోలీసు శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గా గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్ధవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి చర్యలు తీసుకున్న విషయం విధితమే. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, చోరీ కాబడిన సొత్తు,ఇతర వస్తువులను రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులో, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 203 మంది, హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేసి, సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా క్రైమ్ మీటింగ్ కు నందు నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డు మంజూరు ఆర్డరును ఇవ్వడం జరిగినది.
మొదటి వ్యాఖ్య రాయండి!